ఫోర్త్ క్లా స్ విద్యార్థుల్లో హింస! చిన్నారుల మనసు ఎందుకలా మారింది.. - Tv9

నాల్గవ తరగతి చదువుతున్న పదేళ్ల విద్యార్థిపై అతని క్లాస్‌మెట్స్‌ ముగ్గురు కలిసి పదునైన కంపాస్‌ తో విచక్షణారహితంగా దాడి చేశారు. ఒకటి కాదు రెండు కాదా ఏకంగా 108 సార్లు అతన్ని పొడిచారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని ఇండోర్‌లోని ఓ ప్రైవేట్‌​ స్కూల్‌లో జరిగింది. ఘటనను చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సుమోటోగా తీసుకుని నివేదిక ఇవ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఈ ఘటన షాకింగ్‌గా ఉందని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ వ్యాఖ్యానించారు.