బంగారాన్ని ఎక్కువ కాలం వాడకపోతే తుప్పు పడుతుందా

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఇటీవల తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్‌ సంచలనంగా మారింది. ఓబులాపురం మైనింగ్‌ కేసులో తన ఇంట్లో ఉన్న 53 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారని, ఆ నగలు తుప్పుపట్టిపోతాయని గాలి జనార్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ 53 కిలోల నగలతో పాటు రూ.5 కోట్ల విలువైన బాండ్లను తనకు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో గాలి జనార్ధన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు సంగతి ఎలా ఉన్నా బంగారం తుప్పు పడుతుంది అనడం ఆసక్తికరంగా మారింది. నిజంగానే బంగారం తుప్పుపడుతుందా? ఎక్కువ కాలం నగలను వాడకుండా అట్టే పెడితే ఇనుము మాదిరిగాను బంగారం కూడా తుప్పు పట్టి చెడిపోతుందా? బంగారు ఆభరణాలను వాడకుండా దాచిపెడితే ఏమవుతాయి? ఇంతకీ తుప్పు అంటే ఏంటి? ఇలాంటి ప్రశ్నలు అనేక మందిని వేధిస్తున్నాయి. తు