పుట్టిన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఓ కిరాతక జంట ఏమాత్రం కనికరం లేకుండా పురిట్లోనే చంపేసింది. కర్నాటకలోని రామనగర పట్టణంలోని దయానంద సాగర్ ఆస్పత్రిలోని టాయిలెట్ కమోడ్లో నవజాత శిశువు మృతదేహం లభించిన కేసు తీవ్ర సంచలనం కలిగించింది. ఇది నేపాల్ జంట నిర్వాకమని పోలీసులు తేల్చారు. వారిని అరెస్టు చేశారు. నిందితులు అమృత కుమారి , సురేంద్ర మెహ్రా.