దేశంలో, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అలా ముగిశాయో లేదో ఇలా గ్యాస్ రేట్లు పెరిగిపోయాయి. దేశంలోని 5 రాష్ట్రాల్లో గురువారంతో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి, శుక్రవారం, డిసెంబర్ 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచేసాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు . పెరిగిన ధర డిసెంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చింది.19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మరో 21 రూపాయలు పెంచాయి మార్కెటింగ్ కంపెనీలు. పెరిగిన ధర ప్రకారం శుక్రవారం నుండి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1796 రూపాయల 50 పైసలుగా ఉంది.