మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు రద్దు రైల్వే శాఖ క్లారిటీ!

మహా కుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు జన ప్రవాహం పోటెత్తింది. ఎటుచూసినా జనమే జనం. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు పోటెత్తుతున్నారు. వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోట్లాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మౌని అమావాస్య కావడంతో జనం పుణ్యస్నానమాచరించేందుకు ఘాట్‌ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనతో రైల్వే శాఖ కుంభమేళాకు రైళ్లు రద్దు చేసిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి తొక్కిసలాట నేపథ్యంలో రైల్వే శాఖ ట్రైన్స్ తగ్గించిందా? రద్దు చేసిందా? దీనికి సంబంధించి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.