గోదావరి జిల్లాల అంటేనే ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనం. అటువంటి గోదావరి జిల్లాలో ఒకటైన కోనసీమలో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం.. అత్యంత ఘనంగా కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ వేడుక కన్నుల పండువగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది.