కోర్టులోనే లాయర్లను చితకబాదిన పోలీసులు

కోర్టు హాల్లోనే లాయర్లపై పోలీసులు లాఠీలు ఝలిపించారు. నల్లకోటు వేసుకున్న లాయర్లను ఖాకీ చొక్కా ధరించిన పోలీసులు చితకబాదారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఊహించని ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్‌ జిల్లా కోర్టులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సమయంలో జడ్జికి , లాయర్‌కు మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.