సైనికులు దేశ రక్షణకోసం సరిహద్దు ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతుంటారు. దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు ముందుంటారు. విధుల్లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో, సైనికుల పిల్లలు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంటుంటారో.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ నిహారికా హండా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. నిహారికా పెట్టిన పోస్ట్ నెటిజన్లను కదిలిస్తోంది.