ఆక్టోపస్ మెలికలు తిరిగే పార్శ్వాంగాలతో చూడటానికి కొంత భయంకరంగానే ఉంటుంది. తమకు ఆహారంగా ఉపయోగపడే జీవులపై దాడి చేసి చంపి తినేందుకు ఆక్టోపస్లు ఆ పార్శ్వాంగాలను వినియోగించుకుంటాయి. అయితే దక్షిణ కొరియాకు చెందిన 82 ఏళ్ల వృద్ధుడు ఆక్టోపస్లతో చేసే ప్రముఖ ‘సాన్ నాజ్కి’ అనే వంటకం రుచి చూసి మృతిచెందాడు. ప్రాణంతో ఉన్న ఆక్టోపస్ను ముక్కలుగా కోసి దానిపై నువ్వులు, కొన్ని రకాల మసాలాలను కలిపితే ఈ సాన్ నాజ్కి వంటకం రెడీ అవుతుంది.