బ్రిటీషర్ల పాలనలో భారతదేశం 200 ఏళ్ల పాటు నలిగిపోయింది. స్వాతంత్ర పోరాటంతో చివరకు స్వేచ్ఛ లభించింది. అయితే ఈ పోరాటంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఈ కోవలోకే వస్తాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే స్వాతంత్ర పోరాటంలో చపాతీలు కూడా కీలక పాత్ర పోషించాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. భారతీయుల ఆహారంలో భాగమైన రోటీ ఓ ఉద్యమానికి తెరతీసింది. ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించింది. ఇంతకీ ఏంటా ఉద్యమం..? అసలు ఉద్యమం ఎందుకు చేశారు..?