Medigadda: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నుంచి వరద వచ్చి చేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ఫ్లో & ఔట్ ఫ్లో 3,20,410 క్యూసెక్కులుగా ఉంది.