ఇది మల్లెల వేళయనీ.. ఇది వెన్నెల మాసమనీ..తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ.. అన్నాడో సినీకవి. అయితే ఇప్పుడు కోయిల కూయలేదు కానీ.. వేసవిలో రావాల్సిన మామిడి పండ్లు, తాటిముంజలు శీతాకాలంలో కాస్తున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం తాటి ముంజలు ఎంతో ఇష్టంగా తింటారు ప్రజలు. ఇక ఫలరాజమైన మామిడిపండుకు అందరూ ఫ్యాన్సే.