చైనాలో గత కొంతకాలంగా చిన్నారుల్లో వ్యాపిస్తున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు.. ప్రపంచ దేశాలను మళ్లీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. మన దేశంలో ఆరు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. భారత ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హరియాణా, తమిళనాడు రాష్ట్రాలు తమ ఆరోగ్య వ్యవస్థలను అలర్ట్ చేశాయి. శ్వాసకోశ సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆసుపత్రులు, ఆరోగ్య సిబ్బందిని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశించాయి.