బండ్లు ఓడలువుతాయి.. ఓడలు బండ్లు అవుతాయంటే ఇదేనేమో..! నిన్న మొన్నటి వరకు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కంటిన్యూ అయిన పూజా హెగ్డే.. ఇప్పుడేమో... సైలెంట్ అయిసోయింది. కారణం ఏదైనా... గుంటూరోన్ని మిస్ చేసుకుని టాలీవుడ్లో కనిపించకుండా పోయింది. ఎయిర్పోర్టులలో... జిమ్ సెంటర్ల ముందు మాత్రమే కనిపిస్తూ.. ఎలా ఉండే బ్యూటీ ఎలా అయిందనే కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది. ఇక ఈమె ప్లేస్లో గుంటూరు కారం సినిమాలోకి వచ్చిన అమ్ములు అలియాస్ శ్రీలీల.. ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఓ బేబీ సాంగ్ కారణంగా.. ఆ సాంగ్లోని లుక్స్ కారణంగా... ఇప్పుడు తెలుగు కుర్రాళ్ల నయా క్రష్గా మారిపోయింది. అదే కొంత మంది నెటిజన్స్ మాటలో చెప్పాలంటే.. పూజా హెగ్డే ప్లేస్ను రీ ప్లేస్ చేసింది.