భక్తుల రద్దీ నేపథ్యంలో దేవస్వం బోర్డు నిర్ణయం

శబరిమల ఆలయాన్ని దర్శించే భక్తుల కోసం వర్చువల్ క్యూ లైన్‌ స్లాట్‌ల సంఖ్యను పెంచకూడదని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు నిర్ణయించింది. దీనికి బదులుగా, ముందస్తు రిజర్వేషన్ లేకుండా ఆలయానికి వచ్చేవారికి స్పాట్‌ బుకింగ్‌ ద్వారా దర్శనానికి అనుమతి ఇస్తోంది. వర్చువల్ క్యూ స్లాట్‌లు బుక్ చేసుకున్న దాదాపు 12,500 నుంచి 15,000 మంది భక్తులు దర్శనానికి రాకపోవడాన్ని గమనించిన దేవస్వం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.