జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడంలో తీరిక లేకుండా గడుపుతున్నారు. శనివారం కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా పూడిచర్లలో పంట కుంట నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి భారీగా టీడీపీ, జనసైనికులు తరలివచ్చారు.