పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడింది. ఇది తీవ్రవాయుగుండంగా మారి, ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తోంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 380 కిలోమీటర్లు, ఒడిస్సా పారాదీప్ కు దక్షిణంగా 380 కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్ దిగాకు నైరుతి దిశ గా 530, బంగ్లాదేశ్ ఖేపు పారాకు నైరుతి దిశగా 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా తీవ్రవాయుగుండం క్రమంగా బలపడుతోంది.. నవంబర్ 18వ తేదీ నాటికి ఇది మరింత బలపడి బంగ్లాదేశ్ ఖేపు పార - మోంగ్ల మధ్య తీరం దాటుతుందని ఐఎండి ప్రకటించింది.