మరో భార్యా బాధితుడి ఆవేదన వీడియో

టెక్‌సిటీ బెంగళూరులో భార్యా బాధితులు పెరిగిపోతున్నారా? బెంగళూరుకు చెందిన శ్రీకాంత్‌ , బిందుశ్రీ దంపతులు ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవడాన్ని చూస్తే.. ఇలాంటి కేసులు పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఈ కేసు సంచలనం రేపుతోంది. రెండేళ్ల క్రితం వీళ్లిద్దరికి వివాహం జరిగింది. అయితే ఇప్పటి వరకు బిందుశ్రీ తనతో కాపురం చేయలేదని , డబ్బుల కోసం వేధిస్తోందని ఆరోపించాడు శ్రీకాంత్‌ . డబ్బులు ఇవ్వకపోతే దాడి చేస్తునట్టు ఆరోపించాడు.