తమిళనాడులో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. వర్షాలు తగ్గినా... వరద, బురద మాత్రం ఇంకా వదల్లేదు. నాలుగు జిల్లాల్లో వందలాది గ్రామాలు ఇప్పటికీ వరద, బురదలోనే మగ్గుతున్నాయి. వరదబాధితులు ఆహారం, మంచినీళ్ల కోసం అలమటిస్తున్నారు. ఆర్మీ, నేవీ సంయుక్తంగా పెద్దఎత్తున రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ చేపపడుతున్నాయి. ఓవైపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూనే, ఇంకోవైపు హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నాయి. అయితే, ఆహారం కోసం ఎదురుచూస్తోన్న బాధితులు... ఫుడ్ ప్యాకెట్ల కోసం ఎగబడుతున్నారు.