శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర డేంజర్ బెల్ మోగుతోందా? డ్యామ్కు తక్షణమే రిపేర్ చేయకపోతే విధ్వంసం తప్పదా? అంటే నిపుణులు అవుననే హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీటి అవసరాలనే కాకుండా విద్యుత్ను సైతం అందిస్తున్న శ్రీశైలం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇప్పుడు ప్రమాదంలో పడింది. డ్యాం గేట్లు ఎత్తినప్పుడు వరద ప్రవాహ తీవ్రతకు ప్లంజ్పూల్ ప్రాంతంలో ఏర్పడిన భారీ గొయ్యిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.