ప్రధాని నరేంద్రమోదీ పరీక్షా పే చర్చను కాస్త వెరైటీగా నిర్వహించారు. ఈసారి బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పాల్గొన్నారు. ఆమెకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ను ప్రధాని తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. దీపిక, తాను మానసిక ఆందోళనకు గురైన ఆనాటి రోజులను స్టూడెంట్స్తో షేర్ చేసుకున్నారు. ఆ సమయంలో తాను డిప్రెషన్కు లోనై సూసైడ్ ఆలోచనలు వచ్చేవని తెలిపారు. ఒత్తిడిని జయించడం ఎలా? మానసికంగా ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే అంశంపై విద్యార్థులతో ముచ్చటించారు. చదువు, క్రీడలు, మోడలింగ్.. ఆ తర్వాత యాక్టింగ్.