వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి హోటల్ కిచెన్లో చాలా బిజీగా ఉన్నాడు. అతను పరోటా తయారు చేయడానికి పిండి కలుపుతున్నాడు. ఇందులో విశేషమేముంది అనుకోకండి.. అతను ఓ భారీ పరోటాను సిద్ధం చేస్తున్నాడు. అది కూడా ఒక్కడే. సుమారు రెండు మూడు కేజీల పిండిని ముద్దలా కలిపి చపాతీ కర్రతో వత్తాడు. దానిని చూస్తే పిజ్జా బేస్లా అనిపిస్తోంది. దానిపైన ఒక బౌల్తో కర్రీ తీసుకొచ్చి కుమ్మరించాడు. దానిని చక్కగా ఒక మూటలా కట్టాడు. ఆపైన దానిని రౌండ్గా బాల్లా చేశాడు. ఇప్పుడు మరోసారి చపాతీలాగా ఒత్తాడు. అంతే అతి పెద్ద పరోటా రెడీ అయిపోయింది. దానిని జాగ్రత్తగా తీసుకెళ్ళి పెద్ద పెనం మీద కాల్చాడు. ఆహా.. సూపర్ పరోటా రెడీ అయిపోయింది.. దానిని ఓ పెద్ద పళ్లెంలో పెట్టి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేశారు. ఆ భారీ పరోటా 8 మంది కడుపునిండా తినొచ్చు. ఈ పరోటా తయారీకి సంబంధించిన వీడియోను మన టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా వీక్షించారు. 18 వేల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అద్భుతం.. పిజ్జాతో పోల్చుకుంటే ఇది చాలా ఆరోగ్యకరం.., సూపర్ ట్యాలెంట్`` అంటూ కామెంట్లు చేశారు.