తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో జయకేతనం ఎగురవేసింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా రేవంత్ పాలనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో మార్చి 15 శుక్రవారం నాటికి కాంగ్రెస్ ప్రజా పాలన విజయవంతంగా 100 రోజులు పూర్తిచేసుకుంది.