దొంగలు పెట్రోలు బంకులను టార్గెట్ చేశారా అంటే అవుననే అనిపిస్తోంది. అనంతపురంలో రెండు పెట్రోలు బంకుల్లో చోరీకి పాల్పడి లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్తే... మరోచోట కొందరు బంకులో పెట్రోలు కొట్టించుకొని మనీ ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నట్టు నటిస్తూ.. బంక్ సిబ్బందికి టోకరా ఇచ్చి పారిపోయారు.