టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ ఆదివారం తన 35వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. ఇక అదే రోజు వన్డే ప్రపంచకప్లో భాగంగా టీమ్ ఇండియా.. సౌతాఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్కు ఈడెన్ గార్డెన్స్ వేదికైంది.ఈ సందర్భంగా స్టేడియంలో నిర్వాహకులు పటాసుల మోత మోగించారు. ఆ శబ్ధానికి ఒక్కసారిగా షాక్ అయిన పోలీసు శాఖకు చెందిన ‘వాయిస్ ఆఫ్ రీజన్’ అనే గుర్రం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది.