అయ్యప్పస్వామి భక్తులకు గుడ్‌ న్యూస్‌ !! స్వామి దర్శన సమయం గంట పెంపు

అయ్యప్పభక్తులకు గుడ్‌ న్యూస్‌.. శబరిమల అయ్యప్పస్వామి దర్శన సమయాన్ని పెంచుతూ ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా అయ్యప్ప స్వామి భక్తులు పెరుగుతుండటంతో స్వామి దర్శనానికి వచ్చే భక్తులతో కొండలు కిక్కిరిసిపోతున్నాయి.