అక్షరాల 125 కోట్లు... టీం ఇండియా టీ -20 వరల్డ్ కప్ గెల్చిన తర్వాత బీసీసీఐ ప్రకటించిన ప్రైజ్ మనీ. అంత మొత్తం ఎనౌన్స్ చెయ్యగానే... అభిమానులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతే కాదు.. ఆ తర్వాత చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. అందులో అతి ముఖ్యమైనది ఎవరెవరికి ఎంతెంత ఇస్తారు..? అంటే 125 కోట్లను టీం ఇండియాకు ఎలా పంచుతారు. దీనిపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. టీంకి అంటే ఆ రోజు గెల్చిన జట్టులో ఉన్న సభ్యులకా..? లేదా కోచ్లు, క్రికెటర్లు, ఇతర స్టాప్ ఇలా అందరికీనా..? అందరికీ సమానంగా పంచుతారా..? లేదా సీనియార్టీ ప్రకారం పంచుతారా? ఇలా ఎన్నో సందేహాలు.