పంజాబ్ రాష్ట్రంలో పంట దిగుబడి ఇళ్లకు చేరిన తరువాత అసలు కథ మొదలవుతుంది. ఆ తరువాత తమ పొలాల్లోని పంటవ్యర్థాలను తగులబెట్టడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ పంట వ్యర్థాల కాల్చివేత పొరుగున ఉన్న దేశ రాజధాని ఢిల్లీకి శాపంగా పరిణమించింది. స్టబుల్ బర్నింగ్ కారణంగా వెలువడే పొగల ఢిల్లీ వాతావరణాన్ని కలుషితం చేస్తోంది. దాంతో ఢిల్లీ వాసులు ఆందోళన చెందుతున్నారు.