దశాబ్దాలు గడిచిన మా ప్రాంతం అభివృద్దికి నోచుకోవడం లేదని.. స్వరాష్ట్రం సిద్దించిన ఇంకా తమ ప్రాంతం అభివృద్దికి అట్టడుగున ఉండిపోయిందని.. గత దశాబ్ద కాలంలో అభివృద్దికి నిధులుఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా మార్పు రాలేదని.. ఇప్పుడుకూడా నిధులు కేటాయించని పక్షంలో తమ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను మహారాష్ట్రలో కలిపేయండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు.