తిరుమల గిరులు హిమగిరులను తలపిస్తున్నాయి. హోళీ వేళ తిరుమల గిరులు దవళవర్ణంలో మెరిసిపోయాయి. తిరుమల ఏడు కొండలను మంచు కమ్మేసింది. నింగిలోని మేఘాలు నేలపైకి వచ్చాయా అన్నట్టుగా తట్టమైన పొగమంచు పాలసముద్రాన్ని తలపించింది. రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం నెలకొంటోంది. ఓ వైపు ఎండలు ఉక్కపోత... మరోవైపు కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుంటే ఇప్పడు తిరుమలను పొగమంచు కమ్మేసింది.