టోల్ గేట్ల వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి, త్వరితగతిన పేమెంట్స్ పూర్తి చేయడానికి ఫాస్ట్ట్యాగ్ విధానం అమలు చేశారు. అయితే ఈ విధానాన్ని ఇప్పడు కేంద్ర ప్రభుత్వం నిలిపివేయనుందా అంటే.. అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే.. త్వరలో ఫాస్ట్ట్యాగ్ ప్లేస్లో GPS బేస్డ్ విధానం అమలులోకి రానుంది. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టెమ్ను ఏప్రిల్ నాటికి దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.