వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ

రైల్వేకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో లింగరాజ్‌ స్టేషన్‌ వద్ద నాలుగు రైళ్లు ఒకే ట్రాక్‌పై ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ సర్క్యులేట్‌ అవుతోంది. దీంతో కొందరు రైల్వేలోని భద్రతా లోపాలకు ఈ వీడియో అద్దంపడుతోందంటూ షేర్‌ చేయడం మొదలు పెట్టారు. వరుస రైలు ప్రమాద ఘటనల నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడం ఆందోళనకు కారణమైంది.