రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌..!

స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా మంది రెండు సిమ్‌లను వాడుతున్నారు. అయితే ఈ క్రమంలో అవసరం లేకపోయినా రెండో సిమ్ కార్డుకు నెట్ సదుపాయంతో కూడిన రీచార్జి ఓచర్ ప్లాన్‌కు తప్పనిసరిగా అదనపు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఫీచర్ ఫోన్ వినియోగదారుల పరిస్థితి అదే. ఈ నేపథ్యంలో వినియోగదారులకు నెలవారీ ఖర్చు తగ్గించుకునే విధంగా ప్రత్యేక రీఛార్జి ప్లాన్‌లు రాబోతున్నాయి. ఈ మేరకు వినియోగదారులకు టెలికాం నియంత్రణ సంస్థ గుడ్ న్యూస్ అందించింది.