శక్తి పీఠం, జ్యోతిర్లింగం ఒకేచోట వెలసిన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి మహా క్షేత్రంలో అత్యంత క్లిష్టంగా, కష్టంగా మారిన ట్రాఫిక్ సమస్యపై ఎట్టకేలకు పాలక మండలి దృష్టి సారించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం పరిధిలో ట్రాఫిక్ సమస్య నియంత్రణ చర్యలపై ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్ర పాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు అధ్యక్షతన పోలీసులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో డి.పెద్దిరాజు, ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈసమావేశంలో ఆలయ చైర్మన్ మాట్లాడుతూ.. క్షేత్రానికి సెలవులు, పర్వదిన రోజులలో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారన్నారని అన్నారు.