చెన్నైలో ఇప్పటికీ పడవల్లోనే స్కూలుకెళ్తున్న పిల్లలు - Tv9

వర్షం గ్యాప్ ఇచ్చి వారంరోజులు గడుస్తున్నా.. చెన్నైలో తుఫాన్ కష్టం మాత్రం తీరలేదు. ఇప్పటికీ నీటిలోనే చిక్కుకున్నాయి చెన్నై శివారు ప్రాంతాలు.. అనేక చోట్ల బోట్ల సాయంతోనే డేటుడే లైఫ్ నడుస్తోంది..మరోవైపు స్కూల్‌కి వెళ్లే పిల్లల పరిస్థితి అంతే దారుణంగా ఉంది.. బోట్ల సాయం లేనిదే బయటికెళ్లలేని పరిస్థితి..ఇంటి నుంచి స్కూల్‌ వరకు విద్యార్థులను బోట్లలో తీసుకెళ్తున్నారు.. ఇలా ఇంకెంత కాలంమంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు.. మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో చెన్నై అతలాకుతలమైంది. ఎడతెరిపిలేని వర్షాలతో సిటీ జనం విలవిల్లాడుతున్నారు. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. చాలా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. కరెంటు లేకపోవడం, రవాణా స్తంభించడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.