పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్ .. తృటిలో తప్పిన పెను ప్రమాదం - Tv9

చెన్నైలో ఓ లోకల్ ట్రైన్‌ పట్టాలు తప్పింది. ఆవడి వద్ద ఈఎంయూకి చెందిన తిరువళ్ళూరు రూట్ లోకల్ ట్రైన్ అక్టోబర్‌ 24 ఉదయం పట్టాలు తప్పింది. అన్ననూర్ వర్క్‌షాప్ నుంచి ఆవడికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్‌కు సంబంధించిన 4 కోచ్‌లు పట్టాలు తప్పాయి. మెరీనా బీచ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.