భార్య తప్పిపోయిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె కోసం వెదికి వేసారిన అతని కంటిచూపు మందగించింది. ఆసుపత్రిలో చేరి కంటిశుక్లం ఆపరేషన్ చేయించుకున్నాడు. తీరా కళ్లు తెరిచి చూస్తే పక్క బెడ్పైనే భార్య ప్రత్యక్షం కావడంతో అతని ఆనందానికి అవధుల్లేవు. సినిమాల్లో ఈ సీన్ బోలెడు సార్లు చూసే ఉంటాం. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో నిజంగానే జరిగింది. కేవతా తలాబ్ బస్తీకి చెందిన రాకేశ్కుమార్ భార్య శాంతీదేవి జనవరి 13 నుంచి కనిపించకుండా పోయింది. భర్తకు చెప్పకుండా ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కోసం చాలా చోట్ల తిరిగి ఎంతగానో వెదికి మానసిక వేదనకు గురయ్యాడు రాకేశ్.