సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్నినెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తే..కొన్ని షాక్కి గురిచేస్తాయి. తాజాగా బస్సులో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్కు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఓ బస్సులోకి ఎలా వచ్చిందో కానీ ఓ ఎద్దు ప్రత్యక్షమైంది. దాంతో ఒక్కసారిగా ప్రయాణికులు బస్సులోంచి కిందికి దూకేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.బస్టాండ్లో ఓ బస్సు ఆగింది. బస్సులోని ప్రయాణికులంతా మొబైల్స్ చూసుకోవడంలో మునిగిపోయారు.