బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్టైమ్ హైకి చేరిన బంగారం ధరలు మంగళవారం మార్కెట్లో మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో తీవ్ర ప్రభావం పడుతోంది. పెరుగుతున్న ధరలతో బంగారం సామాన్యులకు అందకుండాపోతోంది. అయితే, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మదుపరులు బంగారంపై పెట్టుబడుల వైపు దృష్టి సారిస్తున్నారు.