హోర్డింగ్ పైకెక్కి యువకుడు హల్చల్...

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ చౌరస్తా వద్ద గల హోర్డింగ్ పైకెక్కి ఓ యువకుడు హల్చల్ చేశాడు. స్థానికంగా ఉండే రవీందర్ అనే వ్యక్తి గా స్థానికులు గుర్తించి సంబంధిత పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న టౌన్ సిఐ నరహరి, మూడవ టౌన్ సిబ్బంది యువడికుని పోలీసులు స్థానికుల సహాయంతో కిందకు దింపారు. ఓ వ్యక్తి తనకు వెయ్యి రూపాయలు ఇచ్చేదని, ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని బాధితుడు రవీందర్ తెలిపారు. సదరు యువకుడు పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగించేవాడని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులోనే హోర్డింగ్ పైకి నిద్ర పోయాడు. ఈరోజు ఉదయం కూడా హోర్డింగ్ పైకి ఓకే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారని చెబుతున్నారు. గతంలో సైతం రెండు మార్లు ఇలాగే చేశాడని చెప్పుకొచ్చారు.