ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 60 రైల్వే స్టేషన్లలో విమానాశ్రయం లాంటి భద్రత, రద్దీ నియంత్రణకు తగిన ఏర్పాట్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త నిబంధనలు తీసుకురానుంది. ప్రస్తుతం టికెట్ ఉన్నవారినీ, లేనివారినీ, జనరల్ టికెట్తో ప్రయాణించే అందరు ప్రయాణికులను ప్లాట్ఫారమ్పైకి వెళ్లడానికి అనుమతిస్తున్నారు. ఇకపై అలా జరిగదంటున్నారు రైల్వే అధికారులు.