జంతుప్రేమికులు ఎక్కువగా కుక్కలను పెంచుకునేందుకు ఇష్టపడతారు. విశ్యాసంలో దీనికి సాటి మరెవరూ ఉండరు. అందుకే శునకాలను ఎక్కువగా పెంచుకుంటారు. సాధారణంగా మనం ఓ కుక్కపిల్లను కొనుక్కోవాలంటే.. రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు ఖర్చు అవుతుంది. కానీ వ్యక్తి ఏకంగా రూ.50 కోట్లు పెట్టి కుక్కను కొనుగోలు చేశాడు. వామ్మో కుక్కకోసం ఏకంగా రూ. 50 కోట్లా అనుకుంటున్నారా...నిజమేమరి..! బెంగళూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి ‘కాడాబాంబ్ ఒకామి’ అనే అరుదైన జాతికి చెందిన ‘వోల్ఫ్ డాగ్’ను 5.7 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.50 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు.