ఎన్ని చర్యలు చేపట్టినా ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లను అడ్డుకోలేకపోతోంది పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. ఎంతమందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెడుతున్నా పోలీసుల కళ్ళు గప్పి గంజాయి తరలించకుపోతూనే ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు కూడా గంజాయి స్మగ్లింగ్ను అరికట్టేందుకు ఫోకస్ పెంచారు. ప్రభుత్వ ఆదేశాలతో నిఘా పెంచి స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. తాజాగా అల్లూరి జిల్లా పెదబయలు జంక్షన్ లో.. తనిఖీలు చేసిన పోలీసులకు భారీగా గంజాయి పట్టుబడింది.