విడాకులు కావాలంటూ కోర్టుకు ఎక్కిన భార్యపై ఓ వ్యక్తి వినూత్నంగా పగ తీర్చుకున్నాడు. ఆమె పేరుతో ఉన్న బైక్తో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి ఆమెకు జరిమానాల భారం వేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్పూర్కు చెందిన యువతికి, బీహార్లోని పాట్నాకు చెందిన యువకుడికి వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన నెల రోజులకే వారి మధ్య విభేదాలు రావడంతో ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తకు విడాకుల నోటీసు పంపింది. ప్రస్తుతం ఈ విడాకుల పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉంది. అయితే వివాహ సమయంలో ఆ యువకుడికి యువతి తల్లిదండ్రులు ఒక బైక్ను కానుకగా ఇచ్చారు.