ఓ వ్యక్తి కోడి పుంజును బస్సులో తీసుకురాగా.. దానికి కండక్టర్ ఫుల్ టిక్కెట్ వసూలు చేసిన ఘటన వైరల్ అయింది. తాజాగా, బెంగుళారులోని కేఎస్ఆర్టీసీలో బస్సులో అటువంటి విచిత్రమైన ఘటననే చోటుచేసుకుంది. ఓ మహిళ తన వెంట తెచ్చుకున్న నాలుగు చిలుకల కోసం కండక్టర్ కు 444 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకుంది. మనవరాలితో బస్సు ఎక్కిన ఆ మహిళ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన శక్తి స్కీమ్ కింద ఉచితంగా ప్రయాణం చేసింది.