ఆదర్శ వైద్యుడు !! గిరిజనుల కోసం కొండలు, కోనలు దాటి..

ఛత్తీస్‌గడ్ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అడవుల్లో గుట్టపై దాదాపు 50 ఏళ్ల క్రితం వెలిసిన ఓ గిరిజన గ్రామం. ప్రస్తుతం ఈ మారుమూల పల్లె విషజ్వరాలతో మంచం పట్టింది. ఆ గిరిపుత్రుల ప్రాణాలు కాపాడడం కోసం ములుగు జిల్లా వైద్య సిబ్బంది పెద్ద సాహసమే చేశారు.