లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్లో సీట్ల కాక మొదలైంది.. ఎలాగైనా సీటు దక్కించుకునేందుకు ఇప్పటికే కొందరు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు.